ఎడిటోరియల్

Wednesday, December 5, 2018

2018 డిశంబర్ 03న నూజివీడు కేంద్రంలో విజయవంతమైన"జన జాగరణ ర్యాలీ–సభ"






నూజివీడు: సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో ది.03 డిశంబర్ 2018న డివిజన్ కేంద్రం నూజివీడులో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి. హరినాధ్ అధ్యక్షతన "జనజాగరణ ర్యాలీ – సభ"  జరిగింది.
  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి. బంగార్రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
  కార్ల్ మార్క్స్ 200వ జయంతిని పురస్కరించుకుని ది.13 డిశంబర్ 2018న విజయవాడలో జరుగు సదస్సుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారన్నారు. ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
  ఈ కార్యక్రమంలో AIPWA రాష్ట్రఅధ్యక్షురాలు కామ్రేడ్ టి. అరుణ, డి. పుల్లారావు, యస్. నాగేశ్వరరావు, ch. బాబూరావు, కళావతి , ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 4, 2018

ది.04 డిశంబర్ 2018న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ అనంతపురం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం.


అనంతపూర్: సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ అనంతపురం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం ది.04 డిశంబర్ 2018న అనంతపూర్ లో జరిగింది.
    ఈ కార్యకర్తల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా.. బి. బంగార్రావు మాట్లాడారు. డిశంబర్ 13 న విజయవాడలో సదస్సు జరుగుతుందని ఆ సదస్సులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ముఖ్య అతిధిగా పాల్గొంటారని ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
   ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కా..T.S వలి, G.నల్లప్ప, తులసీ, శ్రీను, చౌడప్ప తదితరులు పాల్గొన్నారు.