ఎడిటోరియల్

Monday, February 24, 2020

ప్రతిఘటన పోరాట యోధురాలు కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు

      శ్రీకాకుళం ఉద్యమం సీనియర్ నాయకురాలు కామ్రేడ్ జయమ్మ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది.          నేను బొడ్డపాడు గ్రామం వెళ్లిన పలు సందర్భాల్లో ఆమెను కలిసే వాడిని అనారోగ్యం వెంటాడుతున్న ఆమెలో విప్లవ నిబద్ధత సడల లేదు. కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లు గాని సహచరుడు కుమారన్న మరణం గాని ఆమెను కుంగదీయ లేదు. జీవితాంతం విప్లవ నిబద్ధతతో జీవించిన వీరవనిత కామ్రేడ్ జయమ్మ. ఆమె  విప్లవజీవితం అందరికీ ఆదర్శం కావాలి. సిపిఐ(యమ్-యల్)లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ తరపున కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నైనాలశెట్టి మూర్తి కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.                       
   సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి.బంగార్రావు తెలిపారు.ఆయన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.        

Sunday, February 23, 2020

భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్(23 ఫిబ్రవరి 2020)కు మద్దత్తుగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ నాయకులు.

         భీమ్ ఆర్మీ దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరపాలని ఇచ్చిన  పిలుపుకు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ పార్టీ మద్దత్తు తెలియజేస్తుందని బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
      నేడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు - యువకులు, ముస్లిం మైనారిటీ వర్గాలు, ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు ,ఎన్.ఆర్.సి ,సి.ఏ.ఏ, ఎన్.పి.ఆర్ లను వ్యతిరేకిస్తున్నారు.  ప్రజాస్వామ్యయుత ప్రజల నిరసనలను లెక్కచేయకుండా  బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేసే చర్యకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ రద్దును వ్యతిరేకిస్తూ సి.ఏ.ఏ,ఎన్.ఆర్.సి,ఎన్.పి.ఆర్ లను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, భీమ్ ఆర్మీ ఫిబ్రవరి 23న భారత బంద్ కు పిలుపునిచ్చింది. భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్ కు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ మద్దతిస్తున్నట్లు ఈ బంద్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి బి. బంగార్రావు విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు  (23 ఫిబ్రవరి 2020న) దేశ వ్యాప్తంగా జరిగిన బంద్ లో భాగంగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రావు, నాయకులు కె.జనార్దన్, దళిత సంఘాలు,ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు.

Thursday, February 20, 2020

శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఏ1 కాంట్రాక్టు కార్మికుల పి.ఎఫ్ సమస్యలు పరిష్కరించాలని AICCTU ఆధ్వర్యంలో ఈ రోజు(20.02.2020) పి.ఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది.


        *ఎ-1 కాంట్రాక్టర్ నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీకాకుళం రిమ్స్  శానిటేషన్ కార్మికుల పి.ఎఫ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానికి పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు AICCTU జిల్లా కన్వీనర్ డి.గణేష్ తెలిపారు* ఈ రోజు ఉదయం రిమ్స్ కార్మికుల పీఎఫ్ ల్లో ఉన్న అవకతవకలును సరిచేయలని, పీఎఫ్ ల్లో జమలలో ఉన్న వ్యత్యాసాలును సరిచేయలని,పీఎఫ్ ల్లో ఉన్న తప్పులను సరిదిద్దాలని కోరుతూ రిమ్స్ గేట్ నుండి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం స్థానిక బలగ జంక్షన్ లో గల పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షకార్యదర్శులు ఆకుల.శ్యామల, దమ్ము సింహాచలం AICCTU జిల్లా కన్వీనర్ డి గణేష్ మాట్లాడుతూ.. ఎ-1కాంట్రాక్టర్ రిమ్స్ ఆస్పత్రిలో పొరుగు సేవలు నిర్వహించి సుమారుగా నేటికి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా రిమ్స్ కార్మికులు సమస్యలు పట్టించుకోకుండా చాలా దారుణంగా వ్యహరిస్తున్నారని,రిమ్స్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన 220 శానిటేషన్ పనుల్లో ఉన్నారని వాళ్ళ పీఎఫ్ ఏంటీ ఈ యస్ ఐ అని కనీసం ఇక్కడ పలికే నాధుడే లేదు ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు ఎందుకంటే కాంట్రాక్టు వాడు ముంబై లో ఉంటాడు, అంతా ఫోన్లో నే కథ అంతా నడుస్తుంది అని ఆవేదన వ్యక్తంచేశారు, రిమ్స్ అధికారులు అసలు శానిటేషన్ వారి సమస్యలు పెట్టావు కాంట్రాక్టుర్ నాలుగు సంవత్సరాలు నుండి పీఎఫ్ సక్రమంగా కట్టడం లేదు అని చెపుతున్న పట్టించుకోకుండా ఉన్నారు.జిల్లా.కలెక్టర్ గారుకి రిమ్స్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చాము ప్రయోజనం మాత్రం శూన్యం...చివరికి గత నెల 28 వతేదీన సమ్మె నోటీసు ఇచ్చిన ఎ-1కాంట్రాక్టర్ గాని రిమ్స్ అధికారులుకు సీమకుట్టినట్టుకుడా లేదు అంటే వారి మొండివైఖరికీ నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటి కైనా ఎ-1కాంట్రాక్టర్ యూనియన్ తో  చర్చలు జరిపి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని లేనియెడల నిరవధిక సమ్మెకు వెళ్ళాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబటి అరుణ,బి సంతోషి, కోనేటి ఈశ్వరమ్మ, కోటిలింగాల రుక్మిణి, బుదేవమ్మా,పైడి త్రినాథరావు,చిన్నారావు, చిత్రి లక్ష్మణరావు, మాధవరావు, నారు దమయంతి, అల్లాడ.సావిత్రి, ఐ వి లక్ష్మీ, లుట్ట పెంటయ్య,సురా రమణ,సరస్వతి, నిలవేణి,మౌనిక, అప్పన్న, ఈశ్వరమ్మ,తదితరులు పాల్గొన్నారు