ఎడిటోరియల్

Monday, February 24, 2020

ప్రతిఘటన పోరాట యోధురాలు కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు

      శ్రీకాకుళం ఉద్యమం సీనియర్ నాయకురాలు కామ్రేడ్ జయమ్మ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది.          నేను బొడ్డపాడు గ్రామం వెళ్లిన పలు సందర్భాల్లో ఆమెను కలిసే వాడిని అనారోగ్యం వెంటాడుతున్న ఆమెలో విప్లవ నిబద్ధత సడల లేదు. కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లు గాని సహచరుడు కుమారన్న మరణం గాని ఆమెను కుంగదీయ లేదు. జీవితాంతం విప్లవ నిబద్ధతతో జీవించిన వీరవనిత కామ్రేడ్ జయమ్మ. ఆమె  విప్లవజీవితం అందరికీ ఆదర్శం కావాలి. సిపిఐ(యమ్-యల్)లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ తరపున కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నైనాలశెట్టి మూర్తి కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.                       
   సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి.బంగార్రావు తెలిపారు.ఆయన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.        

No comments:

Post a Comment