ఎడిటోరియల్

Sunday, February 23, 2020

భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్(23 ఫిబ్రవరి 2020)కు మద్దత్తుగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ నాయకులు.

         భీమ్ ఆర్మీ దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరపాలని ఇచ్చిన  పిలుపుకు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ పార్టీ మద్దత్తు తెలియజేస్తుందని బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
      నేడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు - యువకులు, ముస్లిం మైనారిటీ వర్గాలు, ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు ,ఎన్.ఆర్.సి ,సి.ఏ.ఏ, ఎన్.పి.ఆర్ లను వ్యతిరేకిస్తున్నారు.  ప్రజాస్వామ్యయుత ప్రజల నిరసనలను లెక్కచేయకుండా  బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేసే చర్యకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ రద్దును వ్యతిరేకిస్తూ సి.ఏ.ఏ,ఎన్.ఆర్.సి,ఎన్.పి.ఆర్ లను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, భీమ్ ఆర్మీ ఫిబ్రవరి 23న భారత బంద్ కు పిలుపునిచ్చింది. భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్ కు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ మద్దతిస్తున్నట్లు ఈ బంద్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి బి. బంగార్రావు విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు  (23 ఫిబ్రవరి 2020న) దేశ వ్యాప్తంగా జరిగిన బంద్ లో భాగంగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రావు, నాయకులు కె.జనార్దన్, దళిత సంఘాలు,ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు.

No comments:

Post a Comment